BIT Institute of Technology

BIT Institute of Technology BIT Institute of Technology has been established by Sri Venkateswara Educational Society under the leadership of Sri. P Chandra Mohan in the year 2001 at H

బి.ఐ.టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శ్రీ వెంకటేశ్వర విద్యా సంఘంచే స్థాపించబడింది.గ్రామీణ ప్రజలకు సాంకేతిక విద్యను అందించడమే సంస్థ యొక్క లక్ష్యం

హిందూపూర్‌లోని బి.ఐ.టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BIT Institute of Technology) లో ప్రముఖ మల్టీ నేషనల్  సంస్థ SASMOS HE...
14/04/2026

హిందూపూర్‌లోని బి.ఐ.టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BIT Institute of Technology) లో ప్రముఖ మల్టీ నేషనల్ సంస్థ SASMOS HET Technologies Ltd., బెంగళూరు ఆధ్వర్యంలో 17.03.2026 మంగళవారం నాడు ప్లేస్మెంట్ డ్రైవ్ విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్లేస్మెంట్ కార్యక్రమంలో ప్రొడక్షన్ ఇంజినీర్ (Production Engineer) ఉద్యోగాల కోసం విద్యార్థులను ఎంపిక చేశారు.
ఈ నియామక ప్రక్రియలో కంపెనీ HR ప్రతినిధులు ఇశ్వర్య (Iswarya), అర్పిత (Arpitha) మరియు టెక్నికల్ టీమ్ సభ్యులు మిలాన్ (Milan), సంతోష్ (Santhosh) పాల్గొని విద్యార్థులకు పరీక్షలు మరియు ఇంటర్వ్యూలను నిర్వహించారు.
ఈ ప్లేస్మెంట్ డ్రైవ్‌లో బి.ఐ.టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హిందూపూర్ మరియు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, హిందూపూర్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 40 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డా. పి. చంద్ర మోహన్ గారు మరియు ప్రిన్సిపాల్ డా. ఏ. రమేష్ గారు ఎంపికైన విద్యార్థులను అభినందించి, వారి భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ ప్లేస్మెంట్ కార్యక్రమాన్ని ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ సుదర్శన్ రాజు సమన్వయం చేశారు.
భవిష్యత్ లో మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపింది

బి. ఐ. టి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో 28 ఫిబ్రవరి 2026న సైన్స్ డే సందర్భంగా విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు...
14/04/2026

బి. ఐ. టి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో 28 ఫిబ్రవరి 2026న సైన్స్ డే సందర్భంగా విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ సోలార్ అంబ్రెల్లా, స్మార్ట్ AI సిటీ, కంప్యూటర్ హార్డ్‌వేర్, గేమ్స్ అండ్ గ్రాఫిక్స్, సోలార్ సైకిల్, వాటర్ ప్యూరిఫికేషన్, లైన్‌మన్ సేఫ్టీ మోడల్, స్మార్ట్ ఎనర్జీ మీటర్ బిల్లింగ్, విండ్ పవర్ ప్లాంట్ మోడల్ వంటి పలు వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు.

ఈ ప్రదర్శనను వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సందర్శించి ఆసక్తిగా తిలకించారు. విద్యార్థుల సృజనాత్మకతను అభినందిస్తూ తమ సంతృప్తిని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. రమేష్ మరియు శ్రీ దయానంద్ సమన్వయం చేశారు. ఈ సైన్స్ డే కార్యక్రమం విద్యార్థులలో సృజనాత్మకత, సాంకేతిక అవగాహన మరియు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషించిందని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. వివిధ విభాగాల అధిపతులు మరియు అధ్యాపకులు విద్యార్థులను మోడళ్ల తయారీలో ప్రోత్సహించారు.

కళాశాల చైర్మన్ డా. పి. చంద్ర మోహన్ gaaru విద్యార్థులను అభినందిస్తూ, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు శుభాకాంక్షలు తెలిపారు.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా బిట్ ఇంజినీరింగ్ కాలేజ్, హిందూపూర్ లో ఘనంగా కా...
14/04/2026

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా బిట్ ఇంజినీరింగ్ కాలేజ్, హిందూపూర్ లో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాతగా, సామాజిక సంస్కర్తగా, ఆర్థిక నిపుణుడిగా మరియు దళితుల అభ్యున్నతికి చేసిన విశిష్ట సేవలను గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా కాలేజ్ చైర్మన్ డాక్టర్ పి. చంద్ర మోహన్ గారు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. రమేష్ గారు మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాలేజ్ విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

BIT Institute of Technology లో 17 ఫిబ్రవరి 2026 న National Deworming Day  విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆరోగ...
14/04/2026

BIT Institute of Technology లో 17 ఫిబ్రవరి 2026 న National Deworming Day విజయవంతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ సహకారంతో నిర్వహించగా, ప్రధాన ఆరోగ్య అధికారి (CHO) కవిత గారు, ఏఎన్‌ఎమ్ సరస్వతి గారు, ఆశా వర్కర్లు లక్ష్మీదేవమ్మ గారు మరియు అంబిక గారు పాల్గొన్నారు. స్థానిక ఆరోగ్య సిబ్బంది మరియు నర్సుల సహకారంతో కార్యక్రమం సమర్థవంతంగా జరిగింది.

కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు deworming మాత్రలను అందజేశారు. విద్యార్థుల ఆరోగ్యం మరియు శారీరక వికాసాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెంపొందించారు.

బిట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలుహిందూపూర్‌లోని బిట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 26...
06/02/2026

బిట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

హిందూపూర్‌లోని బిట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 26.01.2026 న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. రమేష్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ నాయకులకు నివాళులు అర్పించి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమాన్ని శ్రీ ఎం. దయానంద్ గారు సమర్థవంతంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా డా. ఎ. రమేష్ గారు విద్యార్థులు మరియు సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, భారతదేశం సాధించిన ప్రగతి, ఆధునిక సాంకేతిక అభివృద్ధి, వందే భారత్ రైళ్లు, అలాగే వికసిత భారత్ – 2047 లక్ష్యాలపై విశదంగా మాట్లాడారు. యువత దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో అధ్యాపకులు మరియు విద్యార్థులు ప్రసంగాలు చేశారు. విద్యార్థులు పిరమిడ్ ఫార్మేషన్, దేశభక్తి ప్రసంగాలు, నృత్య ప్రదర్శనల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించారు.

ఈ వేడుకల్లో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.

కళాశాల ఛైర్మన్ డా. పి చంద్ర మోహన్ గారు విద్యారులకు, మరియు అధ్యాపకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని బి.ఐ.టి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హిందూపూర్ లో సోమవారం ఘనంగా యువజన దినోత్సవ...
06/02/2026

జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని బి.ఐ.టి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హిందూపూర్ లో సోమవారం ఘనంగా యువజన దినోత్సవ వేడుకలు నిర్వహించబడ్డాయి. స్వామి వివేకానందుని జయంతి సందర్భంగా యువతలో ఆధ్యాత్మిక చైతన్యం, శాస్త్రీయ దృక్పథం, సాంకేతిక నైపుణ్యాలు, నైతిక విలువలను సమన్వయం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిర్వహించారు.

కార్యక్రమం స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పమాలలతో నివాళులు అర్పించడంతో ప్రారంభమై, అనంతరం దీప ప్రజ్వలన, ప్రార్థనా గీతం కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి అతిథులను వేదికపైకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ ఆచార్య అజిత్ కుమార్ గారు, ఛైర్మన్ – VDM ఇండియా మూవ్ (ఎన్‌జీఓ), బెంగళూరు మాట్లాడుతూ, నేటి యువత నాయకత్వ లక్షణాలతో పాటు క్రిటికల్ థింకింగ్, ఇన్నోవేషన్ మైండ్‌సెట్, టెక్నాలజీ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. యువతే దేశ అభివృద్ధికి ప్రధాన శక్తిగా నిలుస్తారని, డిజిటల్ యుగంలో సాంకేతికతను సమాజ శ్రేయస్సు కోసం వినియోగించగలిగినప్పుడే వారు సానుకూల మార్పులకు రూపకర్తలవుతారని తెలిపారు. స్వీయ విశ్వాసం, నైతిక విలువలు మరియు నిరంతర అభ్యాసమే యువతకు బలమని అన్నారు.

గౌరవ అతిథిగా విచ్చేసిన పూజ్య శ్రీ శ్రీ శ్రీ సహజానందగిరి స్వామీజీ గారు తమ సందేశంలో, భయాన్ని అధిగమించడం అంటే మన ఆలోచనలపై నియంత్రణ సాధించడమేనని పేర్కొన్నారు. నిస్వార్థ సేవ, మానవ విలువలు, ప్రతి వ్యక్తిలో దైవత్వాన్ని చూడగల దృష్టి యువతకు ఆధ్యాత్మిక స్థిరత్వంతో పాటు మానసిక సామర్థ్యాన్ని పెంచుతుందని చెప్పారు. ఇది విద్యా మరియు సాంకేతిక రంగాల్లో విజయం సాధించడానికి దోహదపడుతుందని వివరించారు.

కళాశాల చైర్మన్ డా. పి. చంద్ర మోహన్ గారు మాట్లాడుతూ, స్వామి వివేకానందుని ఆదర్శాలు నేటి యువతకు మార్గదర్శకమని తెలిపారు. విద్యార్థులు కేవలం డిగ్రీ సాధనకే కాకుండా స్కిల్ డెవలప్‌మెంట్, రీసెర్చ్ ఓరియెంటేషన్, సామాజిక బాధ్యత కలిగి ఉండాలని సూచించారు. చదువే విద్యార్థి యొక్క మొదటి కర్తవ్యమని, విద్య ద్వారా సమాజానికి సేవ చేయడమే నిజమైన విజ్ఞానమని అన్నారు.

ప్రిన్సిపాల్ డా. ఎ. రమేష్ గారు తన ప్రసంగంలో, స్వీయ నియంత్రణ, సమయ నిర్వహణ, క్రమశిక్షణ వంటి గుణాలు విద్యార్థి జీవితానికి ఫౌండేషన్‌ లాంటివని పేర్కొన్నారు. గ్లోబల్ స్థాయిలో జరుగుతున్న సాంకేతిక మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వంటి అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, వాటిని నైతికంగా వినియోగించడమే యువత బాధ్యతని సూచించారు.

తదుపరి పరీక్షలలో, క్రీడల రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మరియు వ్యాస రచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు మరియు ప్రశంసాపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

06/02/2026
ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా, తేదీ 20-12-2025 న బి.ఐ.టి  ఇన్‌స్టిట్...
06/02/2026

ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా, తేదీ 20-12-2025 న బి.ఐ.టి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హిందూపూర్ (BIT Institute of Technology, Hindupur) లో వివిధ కార్యక్రమాలు నిర్వహించబడినవి.

ఈ సందర్భంగా డిప్లొమా విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పోస్టర్లను ప్రదర్శించి, కళాశాల పరిసరాల శుభ్రత కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ దయానంద్ గారు విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.
డా. ఎ. రమేష్, ప్రిన్సిపాల్ గారు, విద్యార్థులకు ఘన మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణ (Solid & Liquid Waste Management) ప్రాధాన్యతను వివరించడంతో పాటు, రీసైక్లింగ్ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు.
అదేవిధంగా డా. పి. చంద్ర మోహన్, చైర్మన్ గారు, సామాజిక సేవలో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో శ్రీమతి మాధురి యశోద, శ్రీ సుదర్శన్ రాజు, శ్రీ గంగాధర్, ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

BIT Diploma Students
01/12/2025

BIT Diploma Students

26.11.2025 76వ భారత రాజ్యాంగ దినోత్సవం ను  పురస్కరించుకొని హిందూపురం బి.ఐ.టి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని...
01/12/2025

26.11.2025

76వ భారత రాజ్యాంగ దినోత్సవం ను పురస్కరించుకొని హిందూపురం బి.ఐ.టి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. రమేష్ గారు మాట్లాడుతూ 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదించబడిన రోజును గుర్తిస్తూ ప్రతి సంవత్సరం ఈ దినాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారని, అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగమును రూపొందించి ఆమోదించడం జరిగిందని నేటి భావితర పౌరులు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. భారత రాజ్యాంగం ఆమోదించబడి నేటికి 76 సంవత్సరాలు అయినదని, ఈ రాజ్యాంగం మనకు హక్కుల తో పాటు బాధ్యతలను కూడా ఇచ్చిందని వాటిని మనం బాధ్యతగా నిర్వహించాలని శ్రీ దయానంద్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వివిధ భాగాల అధ్యాపకులు సిబ్బంది మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

07.11.2025వందే మాతరం జాతీయ గీతానికి 150 సంవత్సరాల పూర్తి వేడుకజాతీయ గీతం *“వందే మాతరం”*కు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భ...
01/12/2025

07.11.2025

వందే మాతరం జాతీయ గీతానికి 150 సంవత్సరాల పూర్తి వేడుక

జాతీయ గీతం *“వందే మాతరం”*కు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, B.I.T ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హిందూపురం విద్యార్థులు మరియు అధ్యాపకులు కళాశాల ఆవరణలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. బంకిమ్ చంద్ర చటర్జీ గారు రచించిన వందే మాతరం గీతం కోట్ల మంది భారతీయులలో స్పూర్తి నింపిందని, ఈ గీతం భారత స్వాతంత్ర్య పోరాటానికి నూతన ప్రేరణగా నిలిచి, దేశభక్తి మరియు ఐక్యతకు ప్రతీకగా మారిందని కళాశాల ప్రిన్సిపాల్ డా. ఏ. రమేష్ తెలిపారు. విద్యార్థులు దేశభక్తి, ఐక్యత మరియు సాంస్కృతిక విలువలను పాటించడానికి ఇటువంటి కార్యక్రమాలు ప్రేరణగా నిలుస్తాయని కళాశాల ఛైర్మన్ డా. పి చంద్ర మోహన్ గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు అధ్యాపకులు వందే మాతర గీతాన్ని ఆలపించారు.

Address

Survey No. :284/1, Kadiri Road BIT (B. O)
Hindupur
515201

Alerts

Be the first to know and let us send you an email when BIT Institute of Technology posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to BIT Institute of Technology:

Share