22/12/2019
ముగిసిన వివా వీవీఐటీ- 2019 యువజనోత్సవం వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి యువజనోత్సవం వివా-వీవీఐటీ 2019 వేడుకలు ఘనంగా ముగిసాయి.రెండు రోజులపాటు నిర్వహించిన ఈ వేడుకల్లో తెలుగు రాష్ట్రాల నుండి 210 కళాశాల నుండి 13 వేల మంది విద్యార్థులు ఈ వేడుకలో పాల్గొన్నారు. సాంకేతిక సాంస్కృతిక క్రీడల నందు విద్యార్థులు ప్రతిభను సృజనాత్మకతను చాటారు.ఈ వేడుకల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ రచయిత నటుడు తనికెళ్ల భరణి హాజరయ్యారు.ఈ వేడుకలలో ప్రాజెక్ట్ ఎక్స్పో పేపర్ ప్రజెంటేషన్ టెక్నికల్ హబ్ డిబేట్ 40 అంశాలలో పోటీలు నిర్వహించారు. సాంస్కృతిక అంశాలలో భాగంగా శాస్త్రీయ నృత్యం,జానపద నృత్యం,ఆధునిక సంగీతం,వాయిద్యం,తెలుగు పద్యం,పెయింటింగ్ వంటి 40 అంశాలలో పోటీలతో పాటు వాలీబాల్, కోకో,క్యారమ్స్,తదితర క్రీడా అంశాలలో పోటీలు నిర్వహించారు. విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థులు రూపొందించిన రసాయన ఎరువుల పిచికారి చేస్తే డ్రోన్,విజ్ఞాన విద్యార్థులు రూపొందించిన యూరియా వంటి ఎరువుల పంపిణి యంత్రం,కిట్స్ విద్యార్థులు రూపొందించిన వాహన వేగ నియంత్రణ పద్ధతిపై ప్రదర్శించిన ప్రాజెక్టులు విశేషంగా ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో వీవీఐటీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్య మనకు మంచి ఆదరణ లభించింది.క్రీడ అంశాల నందు వాలీబాల్ అమ్రిత సాయి విద్యార్థులు, త్రో బాల్ నందు తిరుమల విద్యార్థులు,టేబుల్ టెన్నిస్ నందు విజ్ఞాన్ విద్యార్థులు విజేతలుగా నిలిచారు.శాస్త్రీయ సంగీతం సోలో, గ్రూపులనందు కే.ఎల్.యూనివర్సిటీ విద్యార్థులు విజేతలుగా నిలవగా, బాస్కెట్బాల్ నందు వీవీఐటీ విజేతగా నిలిచింది.వివా-వీవీఐటీ-2K19 వేడుకల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మలినేని సంస్థల వైస్ చైర్మన్ మలినేని పెరుమాళ్ళు, నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.శ్రీనివాస్ కుమార్ పాల్గొనగా,విశిష్ట అతిథిగా ప్రముఖ రచయిత,నటుడు తనికెళ్ల భరణి హాజరయ్యారు. రెండు రోజులుగా నిర్వహించిన పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.విశిష్ట అతిథి తనికెళ్ల భరణి మాట్లాడుతూ,విద్యార్థులు ఇంగ్లీష్ నేర్చుకోవాలని,తెలుగు భాషను ప్రేమించాలని,తెలుగు భాష రుచిని అధ్యాపకులు వారికి పరిచయం చేయాలని సూచించారు జీవితంలో సమయం చాలా గొప్పదని దానిని సక్రమంగా వినియోగించుకున్న విద్యార్థులు విజయం సాధిస్తారని అన్నారు. కళాశాలలో తోటి విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగాలని విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు సమాజంపై బాధ్యత ఉండాలని అన్నారు. తల్లిదండ్రుల కలలకు ప్రతిరూపాలైన పిల్లలు వారికి తమ విజయాల ద్వారా ప్రతిఫలం అందించాలని అన్నారు.వీవీఐటీ చైర్మన్ విద్యాసాగర్ మాట్లాడుతూ ఈ రెండు రోజుల కార్యక్రమము విద్యార్థులకు బాల్యస్మృతులను పరిచయము చేయటమేకాక,సృజనాత్మకత,నైపుణ్యం,పరిశోధన శక్తి ప్రేమికులకు దోహదము చేసిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను ఆయన అభినందించారు. మలినేని సంస్థ చైర్మన్ మలినేని పెరుమాళ్ళు మాట్లాడుతూ,విద్యార్థుల ఆలోచనలను వాస్తవ రూపము దాలిచ్చేవిధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని అన్నారు.నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ న్.శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు నూతన ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని నూతన ఆవిష్కరణలతో విద్యార్థులు రాణించగలరని లక్ష్యం చేరే వరకు నిష్క్రమించు కూడదని సూచించారు.