01/11/2019
*ఉచిత శిక్షణ తరగతులను వినియోగించుకోవాలని గోడపత్రిని ఆవిష్కరించిన--- రాజ్యసభ సభ్యులు, కేంద్ర డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ సభ్యులు కెప్టెన్ లక్ష్మీ కాంతారావు.*
డిఫెన్స్ అంటే దేశ సేవ అని దేశ రక్షణ పాలుపంచుకోవలనే దృఢనిశ్చయం ఉన్న రెండు రాష్ట్రాల యువకులకు అన్ని వర్గాల వారికి ఉచిత శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశం తో నిర్వహించబోయే ఒక సంవత్సరం ఉచిత శిక్షణ గోడ పత్రిని ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు కేంద్ర డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ సభ్యులు, మాజీ ఆర్మీ కెప్టెన్ లక్ష్మీ కాంతారావు గారు. నమ్మకంతో ఈ డిఫెన్స్ అకాడెమీ లో చేరి ఉచిత శిక్షణ వినియోగించుకోవలని దేశ రక్షణ బాధ్యత అనేది మనకు జన్మనిచ్చిన తల్లికి సేవ చేయడం అని, విస్డం స్టడీ సర్కిల్ డిఫెన్స్ అకాడెమీ వారు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, NDA తో పాటు అన్ని కేంద్ర సర్వీసులకు శిక్షణ ఇవ్వటం చాలా అభినందించాల్సిన విషయం అని వీటితో పాటు ఒక సంవత్సరం శిక్షణ అనేది ఒక మహాయుద్దం అని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు గా వీరు నిర్వహించే ఈ ఉచిత శిక్షణ విజయవంతం అవుతుంది అని పేర్కొన్నారు.
అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నా విస్డం ఇన్స్టిట్యూట్ కరీంనగర్ డైరెక్టర్ చుక్క శ్రీనివాస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, NDA, CISF, SSC అన్ని రక్షణ విభాగాలకు ఉచిత శిక్షణ ఇస్తాం అని అలాగే ఉచితం జిమ్ సౌకర్యం, ఉచితంగా T-షర్ట్స్, స్పోర్ట్ షూస్,ఉచితంగా గ్రౌండ్ క్లాసు రూమ్ శిక్షణ, ఉచితంగా ప్రతి వారం గ్రాండ్ టెస్టులు, ఉచితంగా డిజిటల్ మోడ్ లో తరగతులు, ప్రతి వారం దేశ భక్తి, మొటివేషన్ మూవీస్,ఉచితంగా వైద్య పరీక్షలు--మెడికల్ లో ప్రాబ్లమ్ ఉండకుండా ప్రతి నెల కంటి పరీక్షలు, ఫుల్ బాడీ చెకప్ నిర్వహించబడును, మరియు,ఉచితంగా SSC /Inter అర్హత గల అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వబడును అని పేర్కొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విస్డం ఇన్స్టిట్యూట్స్ ఛైర్మన్ మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ గా ఉచిత శిక్షణ తరగతులు ప్లాన్ చేసాం. తెలంగాణ మరియు ఆంధ్ర రెండు రాష్ట్రాల నుండి విశేష స్పందన వస్తుంది. ఇది ఎటువంటి గోల్ మాల్ వ్యవహారం కాదు. నమ్మకం తో రండి విస్డం అంటే విజ్ఞానం అని ఆ విజ్ఞానం మీకు పంచి ఉద్యోగులుగా తీర్చిదిద్దాడమే మా లక్ష్యం అని, ఈ నెల 5వ తేదీ లోపు కరీంనగర్ లోని RTC వర్కుషాప్ దగ్గర లోని బ్రాంచి లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు అని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు 9493890140 కి కాల్ చేయగలరు.