06/02/2026
మారుతున్న సమాజానికి అనుగుణంగా విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి మరో అడుగు
మారుతున్న సమాజ అవసరాలు, వేగంగా మారుతున్న ఉద్యోగ రంగాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, నైపుణ్యాభివృద్ధి ద్వారా తమ భవిష్యత్ ఉద్యోగ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో బోధనలో కొత్త రూపాలు, ఆధునిక విద్యా విధానాలను కళాశాల స్థాయిలో అమలు చేయడం అత్యంత అవసరంగా మారింది.
ఈ దిశగా జమ్మలమడుగు పట్టణంలో ఉన్న సాయి పరమేశ్వర డిగ్రీ కళాశాలలో గత రెండు సంవత్సరాలుగా దేశ్పాండే ప్రోగ్రామ్ విజయవంతంగా అమలవుతోంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, కెరీర్ అవగాహన వంటి అంశాలలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది.
ఇక ఇదే ప్రేరణతో, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తోడ్పడే ఇంకొన్ని అభివృద్ధి కార్యక్రమాలను మా కళాశాలలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్న విధానం, వాటి ప్రభావాన్ని పరిశీలిస్తూ, విద్యార్థులతో నేరుగా ఇంట్రాక్ట్ అవుతూ వారి అభిప్రాయాలు, అవసరాలను తెలుసుకునేందుకు ఈ పర్యటన జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థులతో జరిగిన చర్చలు ఎంతో ఉత్సాహంగా సాగాయి. విద్యార్థుల ఆసక్తులు, వారి భవిష్యత్ లక్ష్యాలను తెలుసుకుంటూ, ప్రస్తుతం కొనసాగుతున్న దేశ్పాండే ప్రోగ్రామ్కు తోడుగా మరిన్ని వినూత్న కార్యక్రమాలను ఎలా అమలు చేయవచ్చో అనే అంశంపై సార్థకమైన చర్చ జరిగింది.
భవిష్యత్తులో ఈ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు మరింత విస్తరించి, సాయి పరమేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉద్యోగ మార్కెట్కు సన్నద్ధమైన నైపుణ్యవంతులుగా ఎదగడానికి ఇది ఒక బలమైన పునాదిగా నిలుస్తుందని ఆశిస్తున్నాం.
ఈ స్ఫూర్తితో, మరింత ఉన్నతమైన విద్యా విధానాలను, శిక్షణ కార్యక్రమాలను మన కళాశాలకు తీసుకురావాలనే ఉద్దేశంతో నేడు కర్ణాటకలోని హుబ్బళ్ళిలో గల 'దేశ్పాండే ఫౌండేషన్' (Deshpande Foundation)ను సందర్శించడం జరిగింది. అక్కడ అమలవుతున్న పద్ధతులను పరిశీలిస్తూ, విద్యార్థులతో నేరుగా ముచ్చటించి వారి అవసరాలను తెలుసుకోవడం ఒక గొప్ప అనుభూతిని ఇచ్చింది.