26/04/2024
IIT J.E.E (Main( - 2024) కృష్ణ చైతన్య విద్యార్థుల హవా..
====================
నేడు N.T.A విడుదల చేసిన జె.ఇ.ఇ (మెయిన్ )- 2024 పరీక్షా ఫలితాలలో కృష్ణచైతన్య కళాశాల ఐన్ స్టీన్ క్యాంపస్ విద్యార్డులు వివిధ కేటగిరిలలో అద్భుత ర్యాంకులు సాదించారు.J. హర్షవర్ధన్ జాతీయ స్థాయిలో 374 వ ర్యాంక్, G. ప్రతాప్ నాయుడు 2054 వ ర్యాంక్ ను సాధించడం జరిగింది.ఇదే విధంగా జాతీయ స్థాయిలో వివిధ కేటగిరి లలో 10000 ర్యాంకు పరిది లో 4 గురు విద్యార్థులు ఒకే క్యాంపస్ నుంచి సాధించడం జరిగినది. ఇదేవిధంగా J. హర్షవర్ధన్ జాతీయస్థాయిలో 99.82 పర్సంటైల్, G. ప్రతాప్ నాయుడు జాతీయ స్థాయిలో 99.42 పర్సంటైల్, సూర్య ప్రకాష్ 97.41 పర్సంటైల్, దివ్య శ్రీ 97.18 పర్సంటైల్, జ్యోతిర్మయి 97.07 పర్సంటైల్ సాదించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల ఏసీ క్యాంపస్ లో విద్యార్థులు అధ్యాపకులు సంబరాలు జరుపుకున్నారు. కృష్ణచైతన్య విద్యార్థులకు సాటి లేదని మరోసారి నిరూపించారు.
ఒకే క్యాంపస్ నుంచి 95 పర్సంటైల్ పైగా 19 మంది విద్యార్ధులు, 90 పర్సంటైల్ పైన 34 మంది విద్యార్థులు సాధించారు. మొత్తంగా 74 మంది విద్యార్థులు ఐఐటీ, అడ్వాన్స్ పరీక్షకు క్వాలిఫై కావడం జరిగినది.
కృష్ణచైతన్య I.I.T & Medical Academy నుండి ఈ అద్భుత ఫలితాలు సాధించారు.
అద్భుత పర్సంటైల్స్ ను సాధించిన విద్యార్థులను కృష్ణచైతన్య విద్యాసంస్థల చైర్మెన్ Dr.R.V. క్రిష్ణారెడ్డిగారు, డైరెక్టర్ రానా ప్రమోద్ రెడ్డి గారు పుష్పగుచ్చాలిచ్చి అభినందించి... మిఠాయిలు తినిపించి సంబరాలు జరుపుకున్నారు
ఒక్క నెల్లూరు జిల్లాకు పరిమితమై, ఒకే క్యాంపస్ నుండి ఈ ఫలితాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని డైరక్టర్లు తెలిపారు. పకడ్బందీ విద్యా ప్రణాళిక, అనుభజ్ఞులైన అధ్యాపక బృందంతో ఈ ఫలితాలు సాధించడం జరిగిందని వారు తెలిపారు. 2024 2025 విద్యాసంవత్సరం నుండి నూతనంగా ప్రారంభిస్తున్న ELITE ప్రోగ్రాం ద్వారా జాతీయస్థాయిలో టాప్ 100 ర్యాంకులు లోపు కృష్ణచైతన్య కళాశాల విద్యార్థులు కైవసం చేసుకుంటారని డైరక్టర్లు తెలిపారు.